హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పంచాయతీరాజ్శాఖ ప్రతి ఏటా అందజేసే ఈ-పంచాయత్ పురస్కారం 2019-20 ఏడాది గాను తెలంగాణకు దక్కింది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ- పంచాయతీ నిర్వహణలో దేశంలో మనమే నెంబర్ వన్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషి, ముందు చూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు లభించాయన్నారు.