‘ఎన్నికల సమయంలో సంగారెడ్డి ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్, ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారు..ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. వైద్య కళాశాలనే కాకుండా నర్సింగ్ కాలేజీ మంజూరు చేసి పెద్దరికం చాటుకున్నారు’.. అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు.
సదాశివపేట, జూలై 10
సదాశివపేట, జూలై 10 : జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో సస్యశ్యామలం కానున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. కాళేశ్వరం జలాలు సింగూరు ప్రాజెక్టులో నిం పి, వాటి ద్వారా సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్ ద్వా రా సాగు నీటిని అందిస్తామన్నారు. సంగమేశ్వర ద్వారా 57 వేల ఎకరాలకు సాగునీరు అందనుండగా, అందులో 37వేల ఎకరాలు సదాశివపేట మండలంలోని రూరల్ ప్రాంతాలకు అందుతుందన్నారు. సదాశివపేట మండలంలోని అన్ని గ్రా మాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపి వ్యవసాయానికి సాగునీరు అందిస్తామని తెలిపారు.
మాట ప్రకారం మెడికల్ కళాశాల
ఎన్నికల సమయంలో సంగారెడ్డి ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని మంత్రి హరీశ్రావు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలువకపోయినా, ఇచ్చిన మాటకు కట్టుబడి మెడికల్ కాలేజీ సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. మెడికల్ కళాశాల ఒక్కటే కాకుండా నర్సింగ్ కళాశాలను మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో 500 పడకలకు పెంచారన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీలకతీతంగా పని చేస్తున్నదని, సంగారెడ్డి నియోజకవర్గంలోఎమ్మెల్యే టీఆర్ఎస్ కాకపోయినా, ప్రజలు తెలంగాణ బిడ్డలని, వారి అభివృద్ధి ముఖ్యమన్నారు.
సదాశివపేటలో రూ.49కోట్లతో ఇంటింటికీ తాగునీరు
సదాశివపేట పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు రూ.49 కోట్లతో ఇంటింటికీ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి హరీశ్రావు తెలిపారు. పనులు కొనసాగుతున్నాయని, 8ట్యాంకులు, పైపులైన్ పనులు పూర్తియ్యాయన్నారు. అలాగే, మిషన్ భగీరథ పథకం పనులతో పాడైన సీసీ రోడ్ల బాగు కోసం రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని కొత్తగా పార్టీలో చేరిన సర్పంచులకు హామీ ఇచ్చారు. అభివృద్ధికి నివేదికలు తయారు చేసి ఇస్తే, వెంటనే నిధులు మంజూరు చేస్తానని చెప్పారు.
గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం..
గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, చేసింది శూన్యమని, అందుకే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రూ.1500 కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడని, ఆపద వస్తే ఎవరికి ఫోన్ చేయాలో ఎవరిని కలవాలో కూడా ప్రజలకు తెలియదన్నారు. అలాంటి నాయకున్న ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా గెలువగానే నియోజకవర్గం ప్రజలకు 40వేల ప్లాట్లు, కాలనీకో ఏటీఎం ఏర్పాటు చేస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు మాయమాటలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మానిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ, కొండాపూర్ ఎంపీపీ మనోజ్రెడ్డి, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సుమిత్ర సుధీర్రెడ్డి, వైస్ చైర్మన్ ఎర్రోళ్ల చిన్న(వినోద్కుమార్), సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, సీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామా టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎంపీపీ, ఆరుగురు సర్పంచులు చేరిక
అభివృద్ధికి ఆకర్షితులై తాము పార్టీ మారుతున్నామని కాంగ్రెస్కు చెం దిన సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ, వెల్టూర్ సర్పం చ్ పబ్బతి లక్ష్మారెడ్డి, నందికంది సర్పంచ్ కుందెన రాజు, పెద్దాపూర్ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, కోనాపూర్ సర్పంచ్ శోభారాణి సంగమేశ్వర్, అంకెనపల్లి విజయలక్ష్మీ భాను, నా గ్సాన్పల్లి సర్పంచ్ అన్నెపల్లి లక్ష్మీ శేఖర్, కంది మండలం ఇంద్రకరణ్ మాజీ సర్పంచ్ భిక్షపతి, వెల్టూర్ మాజీ సర్పంచ్ నర్సింహాగౌడ్ ప్రకటించారు. టీఆర్ఎస్లో చేరిన వీరికి మం త్రి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆరు గ్రామాల ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు టీఆర్ఎస్లో చేరారు. అంతకు ముందు సదాశివపేట మండల పరిధిలోని నందికంది గ్రామం వద్ద మంత్రి హరీశ్రావుకు భారీ స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ వీడి, గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో మండలాన్ని అభివృద్ది పథంలో తీసుకుపోతామన్నారు. వెల్టూర్ గ్రామ సర్పంచ్ పబ్బతి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 20ఏండ్లుగా కాంగ్రెస్కు సేవ చేశానని, ప్రాణం పోతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. కరోనాతో తన కుటుంబం బాధపడుతున్నా, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి భారీ వలసలు కొనసాగనున్నాయని తెలిపారు.