న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ను ఎక్కడ నిర్వహించాలి.. ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్ల పరిస్థితేంటి.. ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు ఎప్పుడు ప్రారంభించాలనే అంశాలపై చర్చించేందుకు బీసీసీఐ నేడు సమావేశం కానుంది. శనివారం వర్చువల్ విధానంలో జరుగనున్న బీసీసీఐ ఎస్జీమ్లో ఈ అంశాలపై కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. ఈ భేటీలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ పాలక మండలి అధ్యక్షుడు బ్రిజేశ్ పటేల్ తదితరులు పాల్గొననున్నారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం యూఏఈ వేదికగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలనుకుంటున్న బోర్డు.. ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంజీ ఆటగాళ్లకు పరిహారం విషయంలోనూ బోర్డు నిర్ణయం తీసుకోనుంది.