చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర సమరం జరగనుంది. చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఒక మ్యాచ్లో మాత్రమే గెలుపొందింది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. హైదరాబాద్పై టాస్ గెలిచిన ఢిల్లీ సారథి పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.