మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్గా మారింది అలియా భట్. ఇన్నాళ్లు నటిగా ఉన్న అలియా ఇప్పుడు నిర్మాతగా మారింది. డార్లింగ్స్ సినిమా ద్వారా నిర్మాతగా మారుతున్న ఈ అమ్మడు కాస్త భయంగా ఉందని పేర్కొంది . తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో కొంచెం నెర్వస్గా ఫీల్ అయినట్టు తన ట్వీట్లో పేర్కొంది అలియా.
అలియా భట్ తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై షారూఖ్ ఖాన్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియా మెయిన్ లీడ్ కాగా షెఫాలీ షా, రోషన్ మ్యాథ్యూ, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. నిర్మాతగా నా తొలి సినిమా అయినప్పటికీ, ముందు నటి అని చెబుతాను. ఈ సినిమా విషయంలో నెర్వస్కు లోనువుతున్నాను. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను.
కొత్త సినిమా ప్రారంభించే ముందు కొంత భయం ఉంటుంది. డైలాగ్ ఎలా చెబుతానో అని టెన్షన్. సెట్కు ఆలస్యంగా వెళతానేమోననే భయంతో 15 నిమిషాలు ముందుగానే షూటింగ్ లొకేషన్కు చేరుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఫీలింగ్ ఎప్పటికీ పోదేమో అనుకుంటానని, నేను అలా ఉండకూడదు.. కానీ భయం మనలో ఉందంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నామని అర్ధమంటూ ఆలియా ట్వీట్ చేశారు.
అయితే ఆలియా చేసిన ట్వీట్పై షారుఖ్ ఖాన్ స్పందిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నువ్వు చేసే మరో ప్రాజెక్ట్కు నన్ను కూడా కలుపుకో అంటూ, నేను చాలా ప్రోఫెషనల్గా ఉంటానని, షూట్కి ఇన్టైంలో వస్తానని ట్వీట్ చేయగా దీనికి ఆలియా స్పందిస్తూ మీరు నా ఫేవరెట్ ఇంతకన్నా ఎక్కువ నేను అడగలేను, ఢీల్ ఒకే అంటూ బదులిచ్చింది. దీనిని బట్టి చూస్తుంటే వీరిద్ధరి మధ్య మరో సినిమా నిర్మాణం జరిగే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చెమో అన్న ఊహాగానం తెరపైకి వచ్చింది.