అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పంజాబ్పై టాస్ గెలిచిన కోల్కతా సారథి ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో పంజాబ్ రెండింటిలో గెలవగా, కోల్కతా ఆడిన ఐదింటిలో ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్, ఒక విజయంతో చిట్టచివరి స్థానంలో కొనసాగుతున్న కోల్కతా జట్లు తొలిసారి కొత్త వేదిక అహ్మదాబాద్లో తలపడబోతున్నాయి. ఈ వేదికలోనైనా సమిష్టిగా రాణించి తిరిగి గెలుపుబాట పట్టాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. అదే జరగాలంటే ఆటతీరు పూర్తిగా మారాల్సిందే..!