తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 22: తెలంగాణ సారస్వతపరిషత్తు తొలిసారిగా తెలు గు సాహిత్య ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచనల పోటీల ఫలితాలను పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గురువారం ప్రకటించారు. 2021 సంవత్సరానికి వచన కవిత్వంలో నాగరాజు రామస్వామి రచించిన విచ్చుకున్న అక్షరం, పద్యగేయ కవిత్వంలో డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన వడ్డేపల్లి రాగరామాయణం గ్రంథాలు పురస్కారానికి ఎంపికయ్యాయి. కథా ప్రక్రియలో కేవీ నరేందర్ రచించిన కథ మానంభవతి, నూటొక్కకథలు, నవల ప్రక్రియలో పరవస్తు లోకేశ్వర్ రాసిన కల్లోల కలలకాలం, విమర్శ ప్రక్రియలో కేపీ అశోక్కుమార్ తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం, ఇతరప్రక్రియల విభాగంలో అన్నవరం దేవేందర్ రాసిన ఊరి దస్తూరి, యువ పురస్కారం విభాగంలో తగుళ్ల గోపాల్ రచించిన దండ కడియం ఎంపికయ్యాయి. ప్ర ధాన ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు 20 వేలచొప్పున, యువ పురస్కారానికి 10 వేల నగదు పురస్కారం అందజేయనున్నా రు. మహిళా విభాగంలో పురస్కారానికి తగిన ఎంట్రీలు రాలేదని శివారెడ్డి తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత పురస్కారాలు అందజేస్తామని పరిషత్తు ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య వెల్లడించారు.