ముంబై: ప్రమాదకర కరోనా వైరస్కు ఎవరూ అతీతులు కారని మరోమారు నిరూపితమైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు కొల్లగొట్టిన కండల వీరుడు జగదీశ్ లాడ్ను కరోనా కబళించింది. వైరస్ బారిన పడిన 34 ఏండ్ల అంతర్జాతీయ బాడీబిల్డర్ జగదీశ్ శనివారం మృతి చెందాడు. సాంగ్లీ(మహారాష్ట్ర)కి చెందిన లాడ్..నాలుగేండ్ల క్రితం ముంబై నుంచి బరోడాకు వలస వెళ్లాడు. వరల్డ్ చాంపియన్షిప్లో రజతంతో పాటు మిస్టర్ ఇండియా పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన జగదీశ్ గత కొన్నేండ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు.