ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ)లో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఆదివారం పెద్దఎత్తున చేరారు. టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి సమక్షంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. అనంతరం టీటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్.శ్రీశైలంను నియమించారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోతె శోభన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నానునాయక్, నాయకులు పవన్కళ్యాణ్, నాగేశ్వర్రావు, సామా శ్రీకాంత్రెడ్డి, కృష్ణ, విజయ్, ప్రేమ్, శ్రీకాంత్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.