కొలంబో: రెండో వన్డేలో టీమిండియా ముందు శ్రీలంక భారీ టార్గెట్నే ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 275 పరుగులు చేసింది. అసలంక (65), అవిష్క ఫెర్నాండో ( 50 ) హాఫ్ సెంచరీలు చేశారు. చివరలో కరుణరత్నె (44, నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.