కొలంబో: తొలి వన్డేలో టీమిండియా ముందు శ్రీలంక భారీ టార్గెట్నే ఉంచింది. కొలంబో వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 48 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగుల వద్దే పరిమతమైంది. కానీ కరుణరత్నె ( 43 నాటౌట్ ) చివరలో బాగా ఆడటంతో భారీ స్కోర్నే చేయగలిగింది. అంతకుముందు కెప్టెన్ దాసున్ షనక ( 39) , అసలంక ( 38 ) పరుగులు చేశారు. ఇక ఓపెనర్లు ఆవిష్క, మినోద్ భానుక శుభారంభం చేశారు.