టోక్యో: ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్పుట్లో ఇండియాకు చెందిన తజిందర్పాల్ సింగ్ తూర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. షాట్పుట్ ఎ గ్రూప్ క్వాలిఫికేషన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన అతడు.. తొలి ప్రయత్నంలో 19.99 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. దీంతో 13వ స్థానంలో నిలిచి ఫైనల్కు వెళ్లకుండానే ఇంటిదారి పట్టాడు. ఈ గ్రూప్లో న్యూజిలాండ్కు చెందిన టోమస్ వాల్ష్ 21.49 మీటర్ల దూరంతో టాప్లో నిలిచాడు.