టోక్యో: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ కాంపిటిషన్ మెన్స్ సింగిల్స్లో ఇండియాకు చెందిన జ్ఞానేశ్వరన్ సత్యన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాడు, హాంకాంగ్కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో అతడు ఓడిపోయాడు. తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాత వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచ్పై ఆశలు రేపిన జ్ఞానేశ్వరన్.. తర్వాత వరుసగా మూడు గేమ్స్ కోల్పోయి మ్యాచ్ చేజార్చుకున్నాడు.