న్యూఢిల్లీ: జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్స్ రెజ్లింగ్ టోర్నీలో భారత యువ రెజ్లర్ అషు కాంస్య పతకం సాధించాడు. పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన 23 ఏండ్ల అషు కాంస్య పతక పోరులో 5-0తో ఆడమ్స్ గ్రగ్లాన్స్ (లిథువేనియా)పై విజయం సాధించాడు. దీంతో ఈ టోర్నీలో భారత్ ఖాతాలో రెండో కాంస్య పతకం చేరింది. తొలి రౌండ్లో ప్రత్యర్థిని ఉడుంపట్టు పట్టిన అషు 3 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెండో రౌండ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మరోరెండు పాయింట్లతో కాంస్య పతకం హస్తగతం చేసుకున్నాడు. ఇతర విభాగాల్లో సాగర్, సమంత, సుష్మ, రితిక, కిరణ పరాజయం పాలయ్యారు.