టోక్యో: ఒలింపిక్స్లో వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిన భారత హాకీ మహిళల జట్టు మొత్తానికి బోణీ చేసింది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్పై 1-0తో విజయం సాధించింది. తొలి మూడు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా.. చివరి క్వార్టర్లో నవ్నీత్ కౌర్ గోల్ చేసి ఇండియాకు విజయం సాధించి పెట్టింది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్లలో ఒకటి గెలిచిన టీమిండియా మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటికైతే నాకౌట్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే శనివారం సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిస్తేనే నాకౌట్ అవకాశాలు ఉంటాయి.