అర్హస్(డెన్మార్క్): ఉబెర్ కప్లో భారత మహిళల పోరాటం ముగిసింది. గురువారం జపాన్తో జరిగిన క్వార్టర్స్ పోరులో భారత్ 0-3 తేడాతో జపాన్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ తొలి పోరులో మాళవిక బన్సోద్ 12-21, 17-21 తేడాతో ప్రపంచ ఐదో ర్యాంక్ ప్లేయర్ అకానె యమగుచి చేతిలో ఓటమిపాలైంది. 34 నిమిషాల్లోనే ముగిసిన పోరులో మాళవిక ఏ మాత్రం పోరాటపటిమ కనబర్చలేకపోయింది. మిగతా మ్యాచ్ల్లో తనీషా, రుతుపర్ణ ద్వయం 8-21, 10-21తో యుకీ ఫుకుషిమా, మయు మత్సుమోటో ద్వయం చేతిలో ఓడింది. మరో పోరులో అదితి భట్ 16-21, 7-21తో సయాక తకహషిపై పరాజయం పాలైంది. మరోవైపు థామస్ కప్లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో చైనా చేతిలో ఓడిన భారత పురుషుల జట్టు శుక్రవారం డెన్మార్క్తో క్వార్టర్స్లో తలపడుతుంది.