టోక్యో: ఒలింపిక్స్ మెన్స్ టెన్నిస్లో ఇండియన్ ప్లేయర్ సుమిత్ నాగల్ పోరు ముగిసింది. 25 ఏళ్ల తర్వాత తొలి రౌండ్ దాటిన ఇండియన్ ప్లేయర్గా నిలిచిన సుమిత్.. రెండో రౌండ్లో ఇంటిదారి పట్టాడు. రెండో సీడ్, రష్యాకు చెందిన మెద్వెదెవ్తో జరిగిన మ్యాచ్లో సుమిత్ 2-6, 1-6 తేడాతో ఓడిపోయాడు. గంటా ఐదు నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్లో రెండు, రెండో సెట్లో మూడు సుమిత్ సర్వ్లను మెద్వెదెవ్ బ్రేక్ చేయగలిగాడు. మ్యాచ్ మొత్తంలో 31 అనవసర తప్పిదాలు సుమిత్ కొంప ముంచాయి.