డర్హమ్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. డర్హమ్లో జరగనున్న ఈ మ్యాచ్లో కౌంటీ చాంపియన్షిప్ లెవన్తో కోహ్లి సేన తలపడనుంది. ఈ నెల 20న ఈ మ్యాచ్ ప్రారంభం కానున్నట్లు డర్హమ్ క్రికెట్ తెలిపింది. డర్హమ్లోని ఎమిరేట్స్ రివర్సైడ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మూడు వారాల పాటు బయో బబుల్ నుంచి బయటకు వెళ్లిన ఇండియన్ క్రికెటర్లు గురువారం డర్హమ్ వెళ్తున్నారు. ఒక క్రికెటర్కు పాజిటివ్గా తేలడంతో అతన్ని వదిలేసి మిగతా టీమంతా ఈ మూడు రోజుల మ్యాచ్ కోసం వెళ్తోంది.
ఇంగ్లండ్ సిరీస్కు ముందు ఇండియన్ టీమ్ ఆడనున్న ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్కు ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదు. తొలి టెస్ట్ ఆగస్ట్ 4 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్లో జరగనుంది. అప్పటి వరకూ టీమ్ ఎమిరేట్స్ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేయనుంది. ఈ మ్యాచ్ను డర్హమ్ క్రికెట్ యూట్యూబ్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అక్కడి బోర్డు తెలిపింది.