కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియన్ స్పిన్నర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లు రాణించడంతో ఒక దశలో వికెట్ నష్టానికి 85 పరుగులతో ఉన్న శ్రీలంక.. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. లెఫ్టామ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2, చాహల్, కృనాల్ చెరొక వికెట్ తీసుకున్నారు. పేస్ బౌలర్లు భువనేశ్వర్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో 32, మినోద్ భనుక 27, భనుక రాజపక్స 24, ధనుంజయ డిసిల్వా 14 పరుగులు చేసి ఔటయ్యారు.