న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమయ్యేందుకు భారత షూటర్లు క్రొయేషియా వెళ్లారు. విశ్వక్రీడల్లో పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా రెండున్నర నెలల పాటు శిక్షణతో పాటు టోర్నీల్లో గురికి పదునుపెట్టనున్నారు. మొత్తంగా 13 మంది షూటర్లు, కోచ్లు, సహాయక సిబ్బంది మంగళవారం క్రొయేషియా రాజధాని జగ్రెబ్కు బయలుదేరారు. అక్కడ ప్రాక్టీస్ తర్వాత ఒసిజెక్లో జరిగే యూరోపియన్ చాంపియన్షిప్ (మే 20 నుంచి జూన్ 6), ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ (జూన్ 22 నుంచి జూలై 3) టోర్నీల్లో భారత షూటర్లు తలపడనున్నారు. కాగా విదేశాల్లో భారత అథ్లెట్లు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించకూడదని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు సూచించారు.