న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో భన్వరీలాల్ పురోహిత్ గవర్నర్గా కొనసాగుతున్నారు. ఆయన శనివారం కేంద్రం పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఈ క్రమంలో ఆయనను తప్పించి, రవిశంకర్ ప్రసాద్ను కొత్త గవర్నర్గా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.