సౌతాంప్టన్:సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉండనున్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లేకుండా క్వారంటైన్లో గడపనున్నారు. ఆఫ్ స్నిన్నర్ అక్షర్ పటేల్ వెల్లడించిన ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ‘విమానంలో బాగా నిద్రపోయాను. మూడు రోజుల పాటు ఒకరికొకరు క్వారంటైన్లో కలుసుకునే అవకాశం ఉండదని తెలిసింది’ అని అక్షర్ వీడియోలో మాట్లాడాడు. జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టీమ్ఇండియాకు స్వల్ప సమయం మిగిలి ఉండగా, మరోవైపు కివీస్..ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్నది. కివీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్తో టీమ్ఇండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.