టోక్యో: ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత ప్లేయర్లకు క్రీడా గ్రామంలోని భోజనం బాగా నచ్చిందట. గత ఒలింపిక్స్ అనుభవాలకు భిన్నంగా ఈసారి నిర్వాహకులు భోజనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారట. అవును ఈ విషయాన్ని పలువురు క్రీడాకారులు సోషల్మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా ఉత్తరభారతీయులు బాగా ఆస్వాదించే ఛోలే భటూరే, బట్టర్, ప్లెయిన్ నాన్స్, పరాఠ, బట్టర్ చికెన్, టోఫు (సోయా పనీర్), షాహి పనీర్ (కాటేజ్ చీజ్), భింది, బాస్మతి, జాస్మిన్ రైస్, బిర్యానీతో మెనూ రూపొందించారు. మంచి ప్రోటీన్ విలువలు కల్గిన భోజనాన్ని ప్లేయర్లకు అందుబాటులో ఉంచారు. టోక్యో గేమ్స్ విలేజ్లోని భోజనం చాలా బాగుందని భారత డిప్యూటీ చెఫ్ డీ మిషన్ ప్రేమ్వర్మ అన్నారు. అథ్లెట్లు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్లు వర్మ పేర్కొన్నారు.