పారా అథ్లెట్ కమలకంట నాయక్ అరుదైన రికార్డు సాధించాడు. ఒడిశాలోని పూరీకి చెందిన అతను వీల్చైర్పై ఒక్కరోజులో ఏకంగా 213 కిలోమీటర్లు ప్రయాణించాడు. చేత్తో నెట్టుకోవాల్సిన ఈ వీల్చైర్పై నాయక్ ఈ రికార్డు సాధించాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది.
ఈ ఫీట్కు గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఆధారాలను సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. గిన్నీస్ బుక్ వాళ్లు ఈ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఇంతకుముందు ఈ రికార్డు పోర్చుగల్కు చెందిన మారియో ట్రినిడాడ్ పేరిట ఉండేది. ఇప్పుడు నాయక్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రభుత్వానికి చెందిన ‘మైగవ్ ఇండియా’ ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.