చెన్నై: తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుదీరనున్నది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 34 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాజ్భవన్ వెల్లడించింది.