న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ పన్నీర్సెల్వం ఇనియాన్.. నోసియల్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లు సాధించి టాప్లో నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లలో ఏడింట విజయం సాధించిన ఇనియాన్.. రెండు గేమ్లను ‘డ్రా’గా ముగించాడు. 7.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ సొలొడోవ్ నిఖెన్కో రెండో స్థానంలో నిలువగా.. కంబ్రత్ యాన్నిక్ (ఫ్రాన్స్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో 9 దేశాల నుంచి 54 మంది ప్లేయర్లు పాల్గొనగా.. ఈ ప్రదర్శనతో ఇనియాన్ 13 రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.