సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా 86 రైల్వే దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఇండియన్ రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ మంగళవారం ప్రకటించారు. అందులో ఇప్పటికే నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు పని చేస్తున్నాయని.. 30 ఆక్సిజన్ కేంద్రాలు వివిధ దశల్లో ఉన్నాయని.. మరో 52 ప్లాంట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే ఆక్సిజన్ తరలింపులో ఇండియన్ రైల్వే తన కృషి కొనసాగిస్తూనే.. రైల్వే దవాఖానల్లో కరోనా రోగుల కోసం వెంటిలెటర్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.