బయల్దేరిన భారత ప్లేయర్లు
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ప్లేయర్లు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. మొత్తం 88 మందితో కూడిన భారత క్రీడా బృందానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్ ప్రామాణిక్, ఐవోఏ చీఫ్ నరిందర్బాత్రా పులువురు సాయ్ ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టోక్యో అథ్లెట్ల కోసం ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశారు.
విశ్వక్రీడలకు వెళ్లే జట్టులో స్టార్ షట్లర్ పీవీ సింధు, సాయిప్రణీత్, సాత్విక్, దీపికా కుమారి, అతానుదాస్, మనికా బాత్రా, శరత్ కమల్, ప్రణతి నాయక్ ఉన్నారు. వీరితో పాటు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యోకు పయనమయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే సెయిలింగ్ జట్టు, బాక్సింగ్ టీమ్, షూటర్లు, వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను వేర్వేరు దేశాల నుంచి టోక్యోకు చేరుకున్నారు.