టోక్యో: ఆర్చరీ మెన్స్ సింగిల్స్లో తరుణ్దీప్ రాయ్ పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో గెలిచి ఆశలు రేపిన అతడు.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేతను తేల్చిన ఈ రౌండ్లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ ఆర్చర్ ఇతాయ్ షానీ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఐదు సెట్లు ముగిసే సమయానికి తరుణ్దీప్, ఇతాయ్ చెరో ఐదు పాయింట్లతో సమంగా నిలిచారు. రెండు, నాలుగు సెట్లను తరుణ్దీప్ గెలవగా.. తొలి, ఐదో సెట్లను ఇతాయ్ గెలిచాడు. మూడో సెట్లో ఇద్దరికీ ఒక్కో పాయింట్ వచ్చింది. దీంతో షూట్ ఆఫ్ తప్పలేదు. ఇందులో ఇతాయ్ పర్ఫెక్ట్ 10 సాధించగా.. తరుణ్ 9 స్కోరు మాత్రమే చేయగలిగాడు.