టోక్యో: ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో శుభారంభం చేసింది. రౌండ్ ఆఫ్ 32లో భూటాన్కు చెందిన కర్మపై 6-0తో సునాయాసంగా గెలిచింది. మూడు సెట్లలోనూ దీపికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీపికా మూడు రౌండ్లలో 26, 26, 27 స్కోరు చేయగా.. కర్మ 23, 23, 24 స్కోరు మాత్రమే చేయగలిగింది. మూడు సెట్లలో మొత్తం ఆరు పాయింట్లు గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. కాసేపట్లో ఆమె తర్వాతి రౌండ్లో తలపడనుంది.