టోక్యో: ఇండియన్ ఆర్చర్, వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. కొరియా ఆర్చర్ ఆన్ సాన్తో జరిగిన క్వార్టర్స్లో 0-6తో దీపికా పరాజయం పాలైంది. మూడు సెట్లలోనూ దీపికపై ప్రత్యర్థి పైచేయి సాధించింది. దీపికా కుమారి మూడు సెట్లలో 27, 24, 24 స్కోరు చేయగా.. ఆన్ సాన్ 30, 26, 26 స్కోరు చేసి సులువుగా గెలిచింది. ఈ ఓటమితో ఒలింపిక్స్లో మెడల్ గెలిచే అవకాశాన్ని దీపిక కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి మెడల్పై ఆశలు రేపిన దీపికా.. క్వార్టర్ఫైనల్తోనే ఇంటిదారి పట్టింది.