టోక్యో: ఇండియన్ ఆర్చర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్ ప్రిక్వార్టర్స్తోనే ముగిసింది. శనివారం ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 8లో అతడు జపాన్కు చెందిన ఫురుకువ తకహరు చేతిలో 4-6తో ఓడిపోయాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో అతాను రెండు సెట్లు కోల్పోయి పరాజయం పాలయ్యాడు. మూడో సెట్లో మాత్రమే అతాను గెలవగా.. రెండు, నాలుగు సెట్లలో ఇద్దరు అథ్లెట్లు ఒకే స్కోరు సాధించారు.