కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన అల్లరి నరేష్ కాస్త పంథా మార్చి నాంది అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంలసు పొందింది. గతంలో గమ్యం, శంభో శివ శంభో, లడ్డూబాబు వంటి విభిన్న కథా చిత్రాలు చేసిన అల్లరి నరేష్ .. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే క్రైమ్ థ్రిల్లర్ చేసి నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించాడు.
ఫిబ్రవరి 19న విడుదలైన నాంది చిత్రంలో అల్లరి నరేష్ చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించే వ్యక్తి పాత్రలో నటించారు. పూర్తి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా నాంది చిత్రం ఉండగా, ఇందులో నరేష్ లోని సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఇక లాయర్ గా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి రోల్ లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. చిత్రంలో నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 12న చిత్రాన్ని ఆహా ప్లాట్ ఫాంలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక థియేటర్లో సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసి మైమరచిపోండి.