బంజారాహిల్స్, జూన్ 6 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాం టిదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిగూడకు చెందిన షేక్ ఫజల్ ఉర్ రహమన్కు రూ.48వేలు, శ్రీనగర్కాలనీకి చెందిన కృష్ణమూర్తికి రూ.53వేలు సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులం దరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతయాదవ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.