న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. కరోనా మహమ్మారి సమయంలో ఒకే సిరీస్ ఆడిన భారత్ వచ్చే నెలలో ఇంగ్లాండ్లో పర్యటించనుంది.
ఏడేండ్ల తర్వాత భారత అమ్మాయిలు తొలి టెస్టు ఆడబోతున్నారు. ఈ టూర్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ సెప్టెంబర్లో భారత మహిళల జట్టు టూర్ ఉండనున్నట్లు ఆసీస్ పేసర్ మేగాన్ స్కట్ తెలిపింది. ఈ పర్యటనలో వన్డే, టీ20 మ్యాచ్లు ఉంటాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో భారత్..ఆసీస్ టూర్కు వెళ్లాల్సి ఉంది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది.