బ్యూనస్ ఎయిర్స్: చివరి వరకు ఉత్కంఠ మధ్య జరిగిన పోరులో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాపై భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా ఆదివారం ఇక్కడ ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన తొలి మ్యాచ్లో షూటౌట్ ద్వారా టీమ్ఇండియా గెలిచింది. తొలుత మ్యాచ్ 2-2తో సమం కాగా.. షూటౌట్లో 3-2తో భారత్ పైచేయి సాధించింది. భారత స్టార్ హర్మన్ప్రీత్ సింగ్ 21వ నిమిషంలో గోల్బాదగా.. అర్జెంటీనా తరఫున మార్టిన్ ఫెరీరో (28వ,30 ని.) వెనువెంటనే రెండు గోల్స్ కొట్టాడు. రెండో అర్ధభాగంలో మరోసారి హర్మన్ప్రీత్ (60వ ని.) సత్తాచాటడంతో మ్యాచ్ సమమైంది. షూటౌట్లో భారత్ మూడు గోల్స్ సాధించడం సహా గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్.. అర్జెంటీనాను వరుసగా మూడుసార్లు విజయవంతంగా అడ్డుకున్నాడు. దీంతో టీమ్ఇండియా 3-2తో గెలిచింది.