సౌథాంప్టన్: మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను ముందే చెప్పేశాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పేన్. టీమిండియా తమ అత్యుత్తమ క్రికెట్కు కాస్త దగ్గరగా ఆడినా చాలు న్యూజిలాండ్పై చాలా ఈజీగా గెలిచేస్తుందని అతడు అన్నాడు. చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయానికి భిన్నంగా పేన్ స్పందించడం విశేషం. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫేవరెట్ అని అందరూ భావిస్తున్నారు. ఇంగ్లండ్ కండిషన్స్కు వాళ్లు అలవాటు పడి ఉండటం, ఈమధ్యే ఆ టీమ్పై 2 టెస్ట్ల సిరీస్ను 1-0తో గెలవడం కివీస్కు కలిసొచ్చే అంశాలని అందరూ విశ్లేషిస్తున్నారు.
కానీ పేన్ వాదన మరోలా ఉంది. ఇండియా తమ సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఈజీగా గెలుస్తుందన్నది నా అంచనా అని పేన్ అన్నాడు. ఈ రెండు టీమ్స్పై ఆస్ట్రేలియా టీమ్కు పేన్ సారథ్యం వహించాడు. న్యూజిలాండ్పై 3-0తో గెలవగా.. ఇండియా చేతిలో మాత్రం 1-2తో కంగారూలు ఓడిపోయారు. న్యూజిలాండ్ మంచి టీమే అయినా.. మొన్నటి సిరీస్లో ఇంగ్లండ్ ఆట ఆశ్చర్యపరిచిందని, ఇది కచ్చితంగా ఇంగ్లండ్ బలమైన టీమ్ కానే కాదని పేన్ అన్నాడు.