కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది. 82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకున్నది. మూడు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో 82 పరుగులు చేసింది. తద్వారా 2-1 తేడాతో టీ-20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకున్నది.
లంకేయులు బౌలింగ్లో టీమ్ ఇండియాను పూర్తిగా కట్టడి చేశారు. టీం ఇండియాను 20 ఓవర్లలో 81 పరుగులకు పరిమితం చేశారు. వానిందు హసరంగ తన బౌలింగ్లో టీం ఇండియాకు చెందిన నాలుగు వికెట్లు చే జిక్కించుకున్నారు.
గమ్మత్తేమిటంటే హసరంగ బర్త్డే ఈ రోజు కావడం గమనార్హం. టీం ఇండియాతో ఆడిన టీ-20 మ్యాచ్ల్లో తొమ్మిది పరుగులకే హసరంగ నాలుగు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా హసరంగ ఎంపికయ్యాడు.
రెండు జట్ల మధ్య హసరంగది రెండో బెస్ట్ బౌలింగ్గా నిలిచింది. ఇంతకుముందు 2019 అక్టోబర్లో టీం ఇండియాతో కలిసి శ్రీలంక తొలిసారి టీ-20 సిరీస్ ఆడింది.
ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కేవలం 81 పరుగులు చేయడం దాని చరిత్రలో మూడో అతి తక్కవ స్కోర్. అంతకుముందు టీం ఇండియా సారధి శిఖార్ ధావన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
బుధవారం జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో గాయపడిన నవ్దీప్ సైనీ స్థానంలో కేరళ పేస్ బౌలర్ సందీప్ వారియర్తో టీం ఇండియా బరిలోకి దిగింది. శ్రీలంక సైతం గాయపడిన ఇసురు ఉదాన స్థానంలో పథుమ్ నిస్సాంకతో రంగ ప్రవేశం చేసింది.
ఇంతకుముందు జరిగిన రెండు టీ-20 మ్యాచ్ల్లో భారత్, శ్రీలంక చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. గురువారం తప్పనిసరి గెలువాల్సిన మ్యాచ్లో సారధి శిఖార్ ధావన్తో సహా టాప్ ఆర్డర్ కుప్పకూలింది.