కొలంబో: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో గురువారం రాత్రి శ్రీలంకతో జరుగుతున్న మూడవ, చివరి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. కేవలం 36 పరుగులకే ఐదు వికెట్లను సమర్పించుకున్న టీం ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
అంతకుముందు 5 ఓవర్లలో టీం ఇండియా 29 పరుగులు చేసి, 4 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలుచుకున్న టీం ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది.
మూడు టీ-20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లు చెరొకటి గెలుచుకుని సిరీస్ను 1-1గా చేశాయి. బుధవారం జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో ఎనిమిది మంది ఇండియా ఆటగాళ్లు ఆటకు దూరంగా ఉన్నారు. దీంతో సిరీస్ గెలుచుకోవాలంటే టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్లో గెలవడం చాలా కీలకం.
క్రునాల్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ఎనిమిది మంది ఐసోలేషన్లో ఉన్నారు. వారిలో సూర్యకుమార్ యాదవ్, ప్రుథ్వీ షా, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మనీశ్ పాండే, కే గౌతం, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరు శుక్రవారం వరకు ఐసోలేషన్లోనే ఉంటారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే టీ-20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఇది చివరి టీ-20 మ్యాచ్ కావడం గమనార్హం. కాగా, బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా ఒత్తిడిని ఎదుర్కొంటున్నది.
తొలి ఓవర్లోనే ఓపెనర్ శిఖార్ ధావన్ రూపంలో టీం ఇండియా మొదటి వికెట్ను కోల్పోయింది. శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా తొలి ఓవర్లో వేసిన నాలుగో బంతిని ఆడబోయిన శేఖర్ ధావన్.. బంతిని డిసిల్వాకు అందించి పెవిలియన్ బాట పట్టాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి టీం ఇండియా 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.