దుబాయ్: 2021-2023 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్లో భారత్ స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే విదేశీ సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ల్లో పర్యటించనుంది. ఇంగ్లండ్తో ఆగస్టు 4న ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్తో డబ్ల్యూటీసీ-2 సమరాన్ని కోహ్లీసేన మొదలుపెట్టనుంది. మరోవైపు డబ్ల్యూటీసీ పాయింట్ల విధానాన్ని కూడా ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టెస్టు గెలిచిన జట్టు ఖాతాలో 12 పాయింట్లు చేరుతాయని, ఒకవేళ డ్రా అయితే రెండు జట్లకు చెరో నాలుగు, టై అయితే తలా ఆరు పాయింట్లు వస్తాయని ప్రకటించింది.