బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అలా బరువు తగ్గాలని అనుకునే వారి కోసం ఒక టీ చక్కగా ఉపయోగపడుతుంది. వాము, జీలకర్రతో చేసిన ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. కేవలం బరువు తగ్గడంలోనే కాకుండా ఈ వాము, జీలకర్ర టీతో ఇంకా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి.
– వాము, జీలకర్ర పొడిని మూడు నెలల పాటు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మల, మూత్ర, చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి.
– అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్తం మొత్తం శుభ్రమవుతుంది. శరీరంపై ఉన్న ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.
– ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
– కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు, చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి.
– గతంలో తీసుకున్న ఆల్లోపతీ మందుల సైడ్ ఎఫెక్ట్ను కూడా తగ్గిస్తుంది.
– మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
– రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది.
– దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
– మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వినికిడి సమస్యలు తగ్గుతాయి.
– మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది.
ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
వేడి చేసిన నీటిని వడకట్టి నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగాలి.
రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు.
నిమ్మ రసం రుచి నచ్చకపోతే ఒక టీస్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు.