సౌతాంప్టన్ : రిజర్వ్ డే రోజున టీమిండియా తీవ్ర వత్తిడిలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లతో హడలెత్తించిన కైల్ జెమిసన్ మళ్లీ విజృంభిస్తున్నాడు. రెండవ ఇన్నింగ్స్లోనూ తన బౌలింగ్తో ఇండియాపై అటాక్ చేస్తున్నాడు. ఇవాళ ఉదయం కెప్టెన్ కోహ్లీ, పుజారా వికెట్లను జెమిసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇండియా తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం రహానే, పంత్ క్రీజ్లోనే ఉన్నా.. న్యూజిలాండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. జెమిసన్ అద్భుత బౌలింగ్ .. ఇవాళ రిజర్వ్ డే ఆట తీరును పూర్తిగా మార్చేసింది. అతి స్వల్ప స్కోర్లకే పుజారా, కోహ్లీలు నిష్క్రమించారు. కోహ్లీ 13, పుజారా 15 రన్స్ చేసి ఔటయ్యారు. కీలక వికెట్లు తీసిన కివీస్ మ్యాచ్పై పట్టు బిగించింది.