కాఠ్మండూ: మలేషియా వేదికగా అక్టోబర్లో జరుగనున్న దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్నకు భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం నేపాల్తో కలిసి ఈనెల 2, 5 తేదీలలో రెండు స్నేహపూర్వక మ్యాచ్లు ఆడనుంది. మరోవైపు అక్టోబర్ 3-13 మధ్య మాలేలో జరుగనున్న సాఫ్ చాంపియన్షిప్ కోసం ఈ రెండు మ్యాచ్లు ఎంతగానో ఉపకరిస్తాయని భారత ఫుట్బాల్ చీఫ్ కోచ్ స్టిమాక్ అన్నాడు. ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుండగా.. నేపాల్, మలేషియా, శ్రీలంక జట్లు కూడా బరిలో ఉన్నాయి. గతంలో భారత్ ఐదుసార్లు సాఫ్ విజేతగా నిలిచింది.