లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్లో మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఇంగ్లండ్ స్పీడ్ బౌలర్లను వాళ్లు ఎదుర్కొన్న తీరు అమోఘం. అయిదో రోజు భోజన విరామ సమయానికి ముందు ఆ ఇద్దరూ అజేయంగా 77 రన్స్ జోడించారు. దాంట్లో షమీ 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. నిజానికి పైచేయిలో ఉన్న ఇంగ్లండ్కు ఆ ఇద్దర భాగస్వామ్యం నిరాశను మిగిల్చింది. ఇక లంచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్కు వస్తున్న సందర్భంలో భారత ఆటగాళ్లకు షమీ, బుమ్రాలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చప్పట్లు కొడుతూ ఆ క్రికెటర్లకు ఘనమైన రీతిలో ఆహ్వానించారు. ఆ అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియో ఇదే.
టార్గెట్ 272
భోజన విరామం తర్వాత ఒక ఒకే ఓవర్ ఆడిన ఇండియా తన ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 298 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. ఆ సమయానికి షమీ 56, బుమ్రా 34 రన్స్తో నాటౌట్గా నిలిచారు. ఆ ఇద్దరూ 9వ వికెట్కు అజేయంగా 89 రన్స్ జోడించారు. ఒకవేళ ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో నెగ్గాలంటే కనీసం ఓవర్కు సగటున 4.53 రన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఇండియాపై ఇంగ్లండ్ ఆ టార్గెట్ను అందుకోవడం సులభం కాదు. కానీ ఆసక్తికర ఫినిష్కు లార్డ్స్ వేదికైంది. ఇక 60 ఓవర్లు టెన్షన్ తప్పదేమో.
స్కోరు బోర్డు
ఇండియా 364, 298-8 డిక్లేర్
ఇంగ్లండ్ 391