ముంబై: అగ్నిప్రమాదంలో మరణించిన రోగుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముంబై బండప్ ప్రాంతంలోని ఒక మాల్లో ఆసుపత్రి నిర్వహిస్తున్నచోట శుక్రవారం అగ్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది రోగులు చనిపోయారు. అగ్నిమాపక శకటాలు అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేశాయి.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే అగ్ని ప్రమాదం జరిగిన మాల్ను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో చాలా మంది వెంటిలేటర్పై ఉన్న రోగులని తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని, వారి నుంచి క్షమాపణలు కూడా కోరుతున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు మాల్లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ అగ్రిప్రమాదం జరిగిందని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రేల్ తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో పది మంది చనిపోయారని, ఇది చాలా సీరియస్ విషయమని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, షాపింగ్ మాల్లో ఆసుపత్రిని నిర్వహించడాన్ని ముంబై మేయర్ తప్పుపట్టారు. అందులోని 70 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.