న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.522 తగ్గి రూ.43,887కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,409 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలపై పెట్టుబడులకు మదుపర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇవాళ బంగారం ధరలు దిగి వచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
బంగారంతోపాటే వెండి ధరలు కూడా ఇవాళ భారీగానే దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,822 తగ్గి రూ.64,805కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,627 వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,696 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.20 అమెరికన్ డాలర్లు పలికింది.