దుబాయ్: ఆసియా జూనియర్ బాక్సిం గ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్స ర్లు పసిడి పతకాల పంట పండించారు. పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 11 స్వర్ణాలు, పది రజతాలతో మెరిశారు. పురుషుల కేటగిరీలో సోమవారం విశ్వామిత్రా (51కేజీలు), విశాల్ (80 కేజీలు)లు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. ఆదివారం ముగిసిన బౌట్లలో రోహిత్, భరత్లు పసిడి నెగ్గగా.. తాజాగా విశ్వామిత్ర, విశాల్ వారికి జత కలిశారు. అబ్బాయిలకు 4 స్వర్ణాలతో పాటు 7 రజతాలు దక్కాయి. మహిళలలో పది మంది ఫైనల్స్కు చేరగా.. వారిలో ఏడుగురు పసిడితో మెరువగా ముగ్గురు రజతాలు నెగ్గారు.