సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తిగా వర్షం వల్ల ఆటను కోల్పోవడంతో ఇవాళ అత్యధికంగా 98 ఓవర్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండవ ఇన్నింగ్స్లో 32 రన్స్తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కివీస్ కూడా గెలిచే ఛాన్సు ఉంది. మ్యాచ్ డ్రా అయ్యే పాజిబులిటీ కూడా ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ టై అయినా ఆశ్చర్యం లేదు. నిజానికి న్యూజిలాండ్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. రిజర్వ్ డే రోజున ఒకవేళ ఇండియాను త్వరగా ఔట్ చేస్తే, టార్గెట్ను చేజ్ చేసేందుకు వాళ్లకు కావాల్సిన సమయం ఉంటుంది. ఇండియాకు కూడా గెలిచే ఛాన్సు ఉంది. కోహ్లీసేన చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసి.. డిక్లేర్ చేస్తే అప్పుడు కివీస్ను వేగంగా ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.
ఇవాళ సౌతాంప్టన్లో ఏం జరిగినా.. అదో చరిత్రాత్మక రోజు అవుతుంది. 2005 తర్వాత జరుగుతున్న తొలి రోజుల క్రికెట్ మ్యాచ్ ఇదే. ఇక 1975 తర్వాత ఇంగ్లండ్లో జరుగుతున్న మొదటి ఆరు రోజుల క్రికెట్ మ్యాచ్ ఇది. అయిదో రోజు కొంత టెన్షన్ పుట్టించినా.. ఇక రిజర్వ్ డే రోజు మాత్రం థ్రిల్లర్ అనివార్యంగా కనిపిస్తున్నది.