మహబూబాబాద్ : నీటితొట్టిలో పడి నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని బంచరాయితండాలో ఈ ఘటన జరిగింది. బంచరాయితండాకు చెందిన గుగులోత్ వినోద్ (పిష్ వినోద్) స్వప్నలకు ముగ్గురు సంతాపం. స్వప్న ఉదయం పొలం పనులకు వెళ్లింది. చిన్నవాడు జయంత్(04) మధ్యాహ్నం ఇంట్లో అన్నాఅక్కతో కలిసి భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు నీటితొట్టి వద్దకు వెళ్లి అందులో పడ్డాడు. జయంత్ కనిపించకపోవడంతో తండ్రి వినోద్ చుట్టుపక్కల వెతికాడు. అనుమానం వచ్చి తొట్టిలో చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. హుటాహుటిన మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంతసేపు తమముందే ఆడుకుంటూ కనిపించిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.