న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అజేయ యాత్ర కొనసాగిస్తున్నారు. పోలండ్ వేదికగా జరుగుతున్న టోర్నీ రెండో రోజు బరిలోకి దిగిన అన్ని బౌట్లలోనూ విజయం సాధించారు. మహిళల విభాగంలో పూనమ్ (57 కేజీలు), వింక (60 కేజీలు) క్వార్టర్స్కు చేరారు. ప్రిక్వార్టర్స్లో బెటా వర్జా (హంగేరి)పై పూనమ్, తరా బోహాత్జుక్ (హెర్జోవినా)పై వింక ఏకపక్షంగా గెలిచారు. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు అంకిత్ నర్వాల్ (64 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు), వికాస్ (52 కేజీలు) విజయాలు సాధించి.. ప్రిక్వార్టర్స్కు చేరారు.